Saturday, 27 June 2026 05:17:45 PM
# ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ.

బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు తగ్గించాలి...సిలిండర్లతో సిపిఎం నిరసన..

Date : 09 March 2026 06:10 PM Views : 80

DNB News - ఆంధ్రప్రదేశ్ / : సామాన్య ప్రజలపై పెరిగిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని శ్రీనివాస భవన్ సర్కిల్ వద్ద గ్యాస్ సిలిండర్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు, సీనియర్ నాయకులు ఈరన్న పాల్గొని మాట్లాడారు. అమెరికా ప్రోత్సాహంతో జరుగుతున్న యుద్ధాల కారణంగా అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగి ప్రజలపై భారంగా మారాయని వారు పేర్కొన్నారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులను ఖండించాలని భారత ప్రభుత్వం గట్టిగా స్పందించాలని కోరారు. యుద్ధాల వల్ల అమాయక ప్రజలు, చిన్నపిల్లలు, పాఠశాలలు, ఆస్పత్రులు, నివాస ప్రాంతాలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితుల కారణంగా వంట గ్యాస్ ధర రూ.60, కమర్షియల్ గ్యాస్ ధర రూ.114 పెరగడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని తెలిపారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇరాన్‌తో ఉన్న భారతదేశ ఆర్థిక, వాణిజ్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సరైన వైఖరితో వ్యవహరించాలని సూచించారు. ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు గ్యాస్ ధరలను తగ్గించడమే కాకుండా యుద్ధాలకు వ్యతిరేకంగా భారత్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ, మండల కార్యదర్శులు లక్ష్మన్న, లింగన్నతో పాటు నాయకులు గోపాల్, తిప్పన్న, పాండు, వీరేష్, వెంకటేశులు, ముని, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :