Saturday, 27 June 2026 04:28:11 PM
# ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ.

రేషన్ షాపుల్లో పూర్తి స్థాయిలో సరుకుల పంపిణీ చేయాలి: డీవైఎఫ్‌ఐ..

Date : 05 June 2026 07:48 AM Views : 45

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని రేషన్ షాపుల్లో సక్రమంగా రేషన్‌తో పాటు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులను పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆదోని తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ, పట్టణంలోని అనేక రేషన్ దుకాణాల్లో కేవలం నాలుగు నుంచి ఐదు రోజులపాటు మాత్రమే సరుకులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన అన్ని నిత్యావసర వస్తువులను అందించకుండా కొన్ని సరుకులకు మాత్రమే పరిమితం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు అందుబాటులో ఉంచి పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ నిబంధనలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ మరియు నిత్యావసర సరుకులను సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు మోహన్, కార్యదర్శి వెంకటేష్, నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :