Saturday, 27 June 2026 05:23:20 PM
# ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ.

జనగణన విజయానికి ప్రజల సహకారం అవసరం--మే 31లోపు ఇంటిగణన పూర్తి చేయడమే లక్ష్యం : కమిషనర్ చల్లా ఓబులేసు..

Date : 11 May 2026 10:31 AM Views : 51

DNB News - ఆంధ్రప్రదేశ్ / : నగర పరిధిలో జనగణనలో భాగంగా తొలి విడత ఇంటిగణన చేపట్టడానికి ప్రజల వద్దకు వస్తున్న ఎన్యూమరేట్లకు పూర్తి సహకారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. ఆదివారం ఆయన కింగ్ మార్కెట్, ఖండేరి వీధి ప్రాంతాల్లో జరుగుతున్న ఇంటిగణన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి జనగణన ఎంతో కీలకమని తెలిపారు. రాబోయే పదేళ్ల కాలానికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో జనగణన సమాచారం ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. నగర పరిధిలో 911 మంది ఎన్యూమరేట్లు ఇంటిగణన నిర్వహిస్తుండగా, 151 మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు నగరంలో 35.07 శాతం జనగణన పూర్తై రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నామని, మే 31లోపు పూర్తి ప్రక్రియను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇళ్ల వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు అవసరమైన వివరాలు అందించాలని సూచించిన కమిషనర్, స్వీయ గణనలో పాల్గొన్న వారు తమ ఎస్‌ఈఐడి నంబర్‌ను ఇవ్వాలని కోరారు. ఆధార్ నంబర్, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు వంటి సమాచారాన్ని ఎన్యూమరేటర్లు ఎట్టి పరిస్థితుల్లో అడగరని స్పష్టం చేశారు. ఎన్యూమరేటర్లు తప్పనిసరిగా ఐడి కార్డులు ధరించి ఉంటారని, అనుమానం ఉంటే ప్రజలు వారి గుర్తింపు కార్డులు పరిశీలించాలని సూచించారు. ప్రజలందరూ బాధ్యతతో సహకరించి నగరాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: