Saturday, 27 June 2026 05:17:43 PM
# ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ.

రంజాన్ తోఫా ఇచ్చి మాట నిలుపుకోండి – ముస్లింలను మోసం చేయొద్దు..

Date : 09 February 2026 10:47 AM Views : 93

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు బాకే హబీబుల్లా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ముస్లిం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూటమి నాయకులు గాలికి వదిలేశారని మండిపడ్డారు. “ప్రజాగళం” ఉమ్మడి మేనిఫెస్టోలో పండుగ కానుకలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, గత రంజాన్ పండుగకు ముస్లింలకు ఒక్క రూపాయి తోఫా కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఈ నెలలో ప్రారంభమవుతున్న రంజాన్ పండుగకు అయినా తోఫా ఇచ్చి ప్రభుత్వం తన మాట నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీ అమలుకాకపోవడం దురదృష్టకరమన్నారు. అలాగే ముస్లింలకు ఎలాంటి షరతులు లేకుండా ఇస్తామని ప్రకటించిన ‘పెళ్లి కానుక’ పథకం ఇప్పటికీ కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. ముస్లిం మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి వంటి కీలక హామీలు కూడా పూర్తిగా విస్మరించబడినాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా నూర్ బాషా కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన ‘ఇస్లామిక్ బ్యాంక్’ హామీకి ఇప్పటివరకు ఎలాంటి ఆచరణ లేదని నిలదీశారు. కేవలం ముస్లింలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, విద్యార్థులు కూడా ఈ ప్రభుత్వ పాలనలో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తున్నా ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు కాకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, మైనార్టీలతో సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని బాకే హబీబుల్లా డిమాండ్ చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :