Saturday, 27 June 2026 04:28:11 PM
# ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ.

క్షయ నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత

Date : 09 June 2026 10:16 AM Views : 34

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మునగాల:మండలపరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపాల పరిధిలోని నరసింహులగూడెం గ్రామం నందు ఆయుష్మాన్ ఆరోగ్య శివిర్ క్యాంపు నిర్వహించడం జరిగింది.. వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ కుంచం ఇందిరా నర్సయ్య, ప్రారంభించి మాట్లాడుతూ,మనగ్రామంలో ఆరోగ్యశాఖ వారు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు..ఆరోగ్య విస్తరణ అధికారి భాస్కర్ రాజు, మరియు టీబీ నోడల్ పర్సన్ లింగం రామక్రిష్ణ గారు మాట్లాడుతూ,వారానికి నుంచి దగ్గు ఆయాసం కళ్ళే పడడం, చాతిలో నొప్పి బరువు తగ్గడం, ఆకలి మందగించడం . ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలనీ తెలిపారు నిక్షయ్ శిబిర్ ప్రచారం అనేది 2030 వరకు భారత దేశాన్ని క్షయ రహిత దేశంగా మార్చే లక్ష్యం వేగవంతం చేయడానికి నిర్వహించే కార్యక్రమమన్నారు. క్షయ వ్యాధి గ్రస్తులు 6నెలల మందులు వాడితే నయం అవుతుంది. ఈ రోజు క్యాంప్ లో 80 మందికి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు.. కేంద్ర ప్రభుత్వం వారు పౌష్టిక ఆహారం కొరకు నెలకు 1000 చొప్పున అందిస్తుంది.. ఈ కార్యక్రమం ద్వారా సామూహికంగా క్షయ నిర్ధారణ కొరకు స్ఫుటం పరీక్ష, ఎక్స్రే పరీక్ష, ద్వారా పరీక్ష నిర్వహించి రోగులను త్వరితంగా గుర్తించడం సకాలంలో వారికి మందులు అందించడం జరుగుతుందన్నారు. నిక్షయ్ శిబిర్ కార్యక్రమం టీబీ ద్వారా సంభవించే మరణాలు తగ్గించడం, క్షయ సంరక్షణ కోసం చేసేఖర్చును సున్నాకు తగ్గించటం ముఖ్యలక్ష్యం అన్నారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ సీతారాములు,నర్సయ్య, మాజీ సర్పంచ్ కొండా రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్, టిబి సూపర్వైజర్ సుభాషిణి, ఎస్.టీ. ఎల్.ఎస్. సైదులు,ఎం పద్మ,హెల్త్ అసిస్టెంట్ సైదులు ,ఆశా కార్యకర్తలు సుధారాణి, జ్యోతి రమణ,నాగమ్మ,లక్ష్మీ, విజయలక్ష్మి ,గ్రామపంచాయతీ సిబ్బంది నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :