DNB News - తెలంగాణ / : ( తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ ) -1535 ఆధ్వర్యంలో మణుగూరులోని బీటీపీఎస్ కర్మాగారం ఎదుట మే డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రీజినల్ ప్రధాన కార్యదర్శి ఆర్. రామచందర్ మే డే జెండాను ఆవిష్కరించారు. అనంతరం యూనియన్ అధ్యక్షులు వి.ప్రసాద్ ప్రసంగించారు. కార్మిక దినోత్సవం స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. విద్యుత్ సంస్థల్లో పెండింగ్లో ఉన్న సమస్యలు యాజమాన్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమాల్లో రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. రాజు మనోహర్,టి.ముత్యాలరావు, స్టేట్ కమిటీ సభ్యులు బి.జార్జి,ఉపాధ్యక్షులు కొత్త జాన్ రెడ్డి,సిహెచ్ వెంకటేశ్వర్లు, వీరబాబు, బి నరసింహారావు,జి. రవికుమార్, తోట గోపి, మారుబోయిన శ్రీనివాస్ మహిళా కార్మికురాల్లో ఎస్ రమాదేవి,రమణ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News